Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:23 AM

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
December 29, 2025 06:30 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్‌ఐ హెచ్చరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులు, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసరంగా బయటకు వెళ్లి సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలని కోరారు. మండల ప్రజలు అందరూ శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News