Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:17 AM

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
29-12-2025 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్‌ఐ హెచ్చరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులు, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసరంగా బయటకు వెళ్లి సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలని కోరారు. మండల ప్రజలు అందరూ శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు.

Sthanikam

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Article Image

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్‌ఐ హెచ్చరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులు, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసరంగా బయటకు వెళ్లి సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలని కోరారు. మండల ప్రజలు అందరూ శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News