Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:35 PM

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రశాంత న్యూ ఇయర్‌కే పోలీసుల పిలుపు — నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
December 29, 2025 06:30 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్‌ఐ హెచ్చరిక

రామన్నపేట స్థానికం ప్రతినిధి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మండల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులు, రోడ్లపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనవసరంగా బయటకు వెళ్లి సమస్యలు ఎదుర్కోకుండా చూసుకోవాలని కోరారు. మండల ప్రజలు అందరూ శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని ఎస్‌ఐ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News