ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి అంబేద్కర్
ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి అంబేద్కర్
Biksham
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్
సూర్యాపేట యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ సమీపంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం నడిపిన ఉద్యమ సూర్యుడు అని గుర్తు చేశారు. అంటరాని వారు పాఠశాలలో ప్రవేశం లేని కాలంలోనే తరగతి గది బయట కూర్చుని విద్యను అభ్యసించి, ప్రపంచ దేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించి అత్యున్నత స్థాయికి చేరుకున్న మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమమైందని తెలిపారు. అంబేద్కర్ జీవితాన్ని ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకొని నిరక్షరాస్యత లేని దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శులు అమరవాది శ్రవణ్, పర్వతం వెంకటేశ్వర్లు, దస్తగిరి, గోపాల్ రెడ్డి, చక్రు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న, బానోతు జానీ నాయక్, మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, పెగ్గిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి