ప్రమాదకర విషపదార్థం సేవించిన యువతికి ప్రాణరక్షణ
ప్రమాదకర విషపదార్థం సేవించిన యువతికి ప్రాణరక్షణ
స్థానికం బృందం
యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో బహుళ వైద్య నిపుణుల సమన్వయంతో ఒక యువతికి ప్రాణాలు కాపాడిన ఘటన చోటుచేసుకుంది.
28 ఏళ్ల యువతి ప్రమాదకరమైన పారా క్వాట్ విషపదార్థాన్ని సేవించగా, మొదట స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పుల్మనాలజీ విభాగాల నిపుణులు కలిసి అత్యవసర చికిత్స ప్రారంభించారు.
వైద్య పరీక్షల్లో యువతికి కిడ్నీ దెబ్బతినడం, జీర్ణాశయ సమస్యలు, ఆహారనాళ వాపు వంటి తీవ్ర సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి అనుగుణంగా రెండు సార్లు హీమోపర్ఫ్యూషన్, డయాలసిస్ చికిత్సలు, యాంటీబయాటిక్స్, ప్రత్యేక గ్యాస్ట్రో చికిత్సలు అందించారు.
వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా రోగి పరిస్థితి మెరుగుపడింది. కిడ్నీ పనితీరు సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా తగ్గాయి. చివరకు ఆమె స్వయంగా నడిచే స్థితికి చేరుకుని డిశ్చార్జ్ అయ్యింది.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పారా క్వాట్ వంటి విషపదార్థాలు ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉందని, సమయానికి సరైన చికిత్స అందితేనే ప్రాణాలను కాపాడగలమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి