ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు.
ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు.
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వచ్చిన వార్తల ప్రభావంతో పోలీసులు వేగంగా స్పందించారు.
వెలుగుపల్లి గ్రామ శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదును ఆసుపత్రి వద్దనే స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర పోలీస్ శాఖ అమలు చేస్తున్న “డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్” విధానంలో భాగంగా బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని వివరించారు.
ఈ విధానం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి