Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:50 PM

ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు.

ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు.

 ప్రమాద బాధితులకు ఇంటివద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు.
March 19, 2026 08:16 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వచ్చిన వార్తల ప్రభావంతో పోలీసులు వేగంగా స్పందించారు.

వెలుగుపల్లి గ్రామ శివారులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదును ఆసుపత్రి వద్దనే స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేసినట్లు తెలిపారు.

రాష్ట్ర పోలీస్ శాఖ అమలు చేస్తున్న “డోర్ స్టెప్ ఎఫ్‌ఐఆర్” విధానంలో భాగంగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని వివరించారు.

ఈ విధానం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు.






మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News