ప్రజావాణిలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం
ప్రజావాణిలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం
Biksham
పైరవీలు లేకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పి నరసింహ సూచన
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వినిపించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించిన ఎస్పి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేసి, అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు నమ్మకం కల్పించాలని అధికారులకు సూచించారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పి నరసింహ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి