Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 23, 2026 05:18 PM

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
March 23, 2026 03:39 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కలిగి ప్రతి అర్జీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణిలో అందిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 39, డివిజనల్ పంచాయతీకి 5, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎంప్లాయిమెంట్, సివిల్ కోర్టు, లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా మార్కెటింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్-1, పంచాయతీ రాజ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా అధికారులు నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News