Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆదోనిలో అంబేద్కర్ జయంతి వేడుకలు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 08:23 PM

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే

ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజ్యాంగమే
April 14, 2026 04:24 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దానిపై దాడులను అడ్డుకోవాలి: బెజవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట: ప్రజాస్వామ్యాన్ని కాపాడేది భారత రాజ్యాంగమేనని, దానిపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ, సెక్యులర్ విలువలను కాపాడే రాజ్యాంగం దేశానికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలను బలహీనపరచే విధానాలు అమలు చేస్తోందని, ఇవి దేశ ఏకత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాలనలో ప్రతిబింబింపజేయడానికి చేసే ప్రయత్నాలు ప్రమాదకరమని అన్నారు.డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కేవలం పుస్తకం మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, యువజన నాయకుడు ఎడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News