Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:06 PM

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే
11-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మార్గదర్శి

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ, కులవివక్ష, సామాజిక అసమానతలపై సూత్రప్రాయంగా, ప్రయోగాత్మకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.పూలే ఆలోచనలు కేవలం సంస్కరణలకే పరిమితం కాకుండా, సమగ్ర సామాజిక పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మౌలిక సూత్రాలను భారతీయ సమాజానికి అన్వయిస్తూ సమాన హక్కుల ఆధారిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు.యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు పీడిత వర్గాల్లో చైతన్యాన్ని రేకెత్తించిన ఉద్యమాలుగా మారాయని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, కుల నిర్మూలన వంటి భావజాలాలను ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు పూలే అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో బచ్చలకూరి గోపి, బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే

Article Image

సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మార్గదర్శి

ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ, కులవివక్ష, సామాజిక అసమానతలపై సూత్రప్రాయంగా, ప్రయోగాత్మకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.పూలే ఆలోచనలు కేవలం సంస్కరణలకే పరిమితం కాకుండా, సమగ్ర సామాజిక పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మౌలిక సూత్రాలను భారతీయ సమాజానికి అన్వయిస్తూ సమాన హక్కుల ఆధారిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు.యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు పీడిత వర్గాల్లో చైతన్యాన్ని రేకెత్తించిన ఉద్యమాలుగా మారాయని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, కుల నిర్మూలన వంటి భావజాలాలను ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు పూలే అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో బచ్చలకూరి గోపి, బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News