ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే
ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన మహానేత పూలే
Biksham
సమాన హక్కుల సమాజ నిర్మాణానికి మార్గదర్శి
ప్రజాస్వామ్య తలుపులు తెరిచిన దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజంలో వర్ణవ్యవస్థ, కులవివక్ష, సామాజిక అసమానతలపై సూత్రప్రాయంగా, ప్రయోగాత్మకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.పూలే ఆలోచనలు కేవలం సంస్కరణలకే పరిమితం కాకుండా, సమగ్ర సామాజిక పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి మౌలిక సూత్రాలను భారతీయ సమాజానికి అన్వయిస్తూ సమాన హక్కుల ఆధారిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు.యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు పీడిత వర్గాల్లో చైతన్యాన్ని రేకెత్తించిన ఉద్యమాలుగా మారాయని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, కుల నిర్మూలన వంటి భావజాలాలను ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు పూలే అని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో బచ్చలకూరి గోపి, బొమ్మగాని వినయ్ గౌడ్, ఈశ్వర్ సింగ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి