Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

“ప్రజలే బాస్, డివిజనే ఆఫీస్” – హార్ట్ డివిజన్ సభలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

“ప్రజలే బాస్, డివిజనే ఆఫీస్” – హార్ట్ డివిజన్ సభలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

“ప్రజలే బాస్, డివిజనే ఆఫీస్” – హార్ట్ డివిజన్ సభలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
April 03, 2026 08:11 AM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండ నగర పాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో “ప్రజలే బాస్… వార్డే ఆఫీస్” అనే భావంతో వార్డు స్థాయి పరిపాలనను బలపరిచే దిశగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో **32వడివిజన్, శ్రీనగర్ కాలనీ పార్క్‌లో గురువారం జరిగిన వార్డు సభ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.“స్మార్ట్ మేయర్ – స్మార్ట్ నల్లగొండ సిటీ” లక్ష్యంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, వార్డు సభలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై విస్తృతంగా ప్రసంగించారు. పాలన వార్డు స్థాయికి దిగి వచ్చి, ప్రతి సమస్యను ప్రజల చేతిలో పెట్టి పరిష్కరించేందుకు ఈ 99‑రోజుల యాక్షన్ ప్లాన్ పనిచేస్తుందని ప్రజలకు రెండు చెయ్యి చాపి హామీ ఇచ్చారు.

ప్రజలు చెప్పిందే పని… చెప్పిందే ప్రగతి” అంటూ మేయర్ ఇచ్చిన క్లియర్ మెసేజ్ స్థానికుల మధ్య ఉత్సాహాన్ని పెంచింది.వార్డు సభలో మేయర్ మాట్లాడుతూ, శ్రీనగర్ కాలనీలోని డ్రైనేజీ, రోడ్లు, వీధి లైటింగ్వంటి ప్రధాన సమస్యలపై ఆన్‌స్పాట్ రివ్యూలు చేశారు. ప్రతి సమస్యపై అధికారులకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చి, “ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం కల్పించాలని” కఠిన వార్నింగ్ జారీ చేశారు. పనులు ఆలస్యం చేస్తే బాధ్యత ఎవరిపై ఉంటుందో స్పష్టంగా చెప్పి, ప్రతి ప్రాజెక్టుకు స్పష్టమైన డెడ్‌లైన్‌లు ఇవ్వాలని కమిట్‌మెంట్ పెంచారు.స్థానిక ప్రజలు కూడా ఈ సభలో చురుగ్గా పాల్గొని, డ్రైనేజీ నీరు ఇండ్లకు ప్రవేశించడం, పగిలిన రోడ్లు, కొన్ని రోడ్ల మీద లైట్లు లేకపోవడం, కాలనీలో చిన్న చిన్న గుంటలు, పార్క్‌లో సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలను వివరంగా విన్నవించారు. ఈ వినతులన్నిటిని మేయర్ తీసుకుని, ప్రతి సమస్యకు కనీస గడువు ఇచ్చి, **స్థానికుల ముందే అధికారులకు లక్ష్య సమయం నిర్దేశించడం హాట్ మూమెంట్‌గా మారింది.

ఈ వార్డు సభలో మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొని, నల్లగొండ అభివృద్ధి దిశగా కీలక సూచనలు ఇచ్చారు. పాఠశాలలు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛత వంటి అంశాలపై ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అమలవ్వాలని కోరారు. ప్రజా పాలన కార్యక్రమం కేవలం పత్రాలు, రిపోర్టులు కాకుండా, ప్రజల రోజువారీ జీవితంలో కనిపించేలా ఉండాలని ఆయన హెచ్చరించారు.

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, ఈ సభలో మున్సిపల్ సిబ్బందిపై స్పెషల్ ఫోకస్ పెట్టి, వారి పనితీరు, పరిశుభ్య సేవలు, నీటి సరఫరా, వీధిలైట్ల వంటి అంశాలపై క్రమం తప్పకుండా పరిశీలన చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆలస్యం, నిర్లక్ష్యం అస్సలు వద్దని సమాజం కోసం పనిచేయాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News