Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:11 PM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు
April 15, 2026 05:42 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు త్రవ్వడం, పాత బోర్లను మరమ్మతులు చేయించడం, నీటి సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టణంలోని ప్రతి కాలనీలో పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తూ చెత్తను సమయానికి తొలగించడం, కాలువలను శుభ్రం చేయించడం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, వేడి తాకిడి నుంచి రక్షణ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాగజీవన్ రావు, 15 వార్డుల మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News