ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు… మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు త్రవ్వడం, పాత బోర్లను మరమ్మతులు చేయించడం, నీటి సరఫరా నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పట్టణంలోని ప్రతి కాలనీలో పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తూ చెత్తను సమయానికి తొలగించడం, కాలువలను శుభ్రం చేయించడం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, వేడి తాకిడి నుంచి రక్షణ కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాగజీవన్ రావు, 15 వార్డుల మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి