Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 08:35 PM

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్
May 04, 2026 06:46 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల ప్రజావాణి నిర్వహించబడుతుండగా, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ డివిజన్ కేంద్రాలలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాల్లో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజులలోపు పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే కారణాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 134 ఫిర్యాదులు అందగా, కలెక్టరేట్‌కు 57, సంగారెడ్డి డివిజన్‌కు 29, ఆందోల్‌కు 2, నారాయణఖేడ్‌కు 24, జహీరాబాద్‌కు 22 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News