Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:00 AM

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్
04-05-2026 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల ప్రజావాణి నిర్వహించబడుతుండగా, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ డివిజన్ కేంద్రాలలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాల్లో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజులలోపు పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే కారణాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 134 ఫిర్యాదులు అందగా, కలెక్టరేట్‌కు 57, సంగారెడ్డి డివిజన్‌కు 29, ఆందోల్‌కు 2, నారాయణఖేడ్‌కు 24, జహీరాబాద్‌కు 22 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు చేరువలో ప్రజావాణి సేవలు: కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ప్రజలు తమ డివిజన్ కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల ప్రజావాణి నిర్వహించబడుతుండగా, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ డివిజన్ కేంద్రాలలోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాల్లో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి 30 రోజులలోపు పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే కారణాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 134 ఫిర్యాదులు అందగా, కలెక్టరేట్‌కు 57, సంగారెడ్డి డివిజన్‌కు 29, ఆందోల్‌కు 2, నారాయణఖేడ్‌కు 24, జహీరాబాద్‌కు 22 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News