Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:53 PM

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి
February 23, 2026 08:07 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల నుండి వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై మొత్తం 96 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రెడ్డప్ప, డిటిఆర్బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News