PRINT TIME: February 23, 2026 09:47 PM
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి
February 23, 2026 08:07 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల నుండి వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై మొత్తం 96 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రెడ్డప్ప, డిటిఆర్బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి