Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 12:57 AM

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అడిషనల్ ఎస్పి
February 23, 2026 08:07 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల నుండి వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై మొత్తం 96 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రెడ్డప్ప, డిటిఆర్బీ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News