Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:36 AM

ప్రజల ఆశీర్వాదమే నా బలం

ప్రజల ఆశీర్వాదమే నా బలం

ప్రజల ఆశీర్వాదమే నా బలం
February 15, 2026 02:29 AM 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


45వ వార్డు ప్రజలకు గండూరి పావనికృపాకర్ కృతజ్ఞతలు

తనను వరుసగా మూడోసారి గెలిపించి ఆశీర్వదించిన 45వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తనకు బలమని పేర్కొన్నారు.2014లో మొదటిసారిగా వార్డు ప్రజలు తనను గెలిపించారని, అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు కేవలం 54 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. ఈసారి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ 622 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ప్రజలు మూడోసారి అవకాశం ఇవ్వడం పట్ల తాను రుణపడి ఉంటానని, మరో ఐదు సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమవుతానని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయాన్ని సాధించానని, వారి విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని గండూరి పావనికృపాకర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News