Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:18 PM

ప్రజల ఆశీర్వాదమే నా బలం

ప్రజల ఆశీర్వాదమే నా బలం

ప్రజల ఆశీర్వాదమే నా బలం
February 15, 2026 02:29 AM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


45వ వార్డు ప్రజలకు గండూరి పావనికృపాకర్ కృతజ్ఞతలు

తనను వరుసగా మూడోసారి గెలిపించి ఆశీర్వదించిన 45వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తనకు బలమని పేర్కొన్నారు.2014లో మొదటిసారిగా వార్డు ప్రజలు తనను గెలిపించారని, అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు కేవలం 54 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. ఈసారి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ 622 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ప్రజలు మూడోసారి అవకాశం ఇవ్వడం పట్ల తాను రుణపడి ఉంటానని, మరో ఐదు సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమవుతానని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయాన్ని సాధించానని, వారి విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని గండూరి పావనికృపాకర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News