Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:54 AM

ప్రజాబాటలో విద్యుత్ అధికారుల కు సమస్యలపై వినతిపత్రం

ప్రజాబాటలో విద్యుత్ అధికారుల కు సమస్యలపై వినతిపత్రం

ప్రజాబాటలో విద్యుత్ అధికారుల కు సమస్యలపై వినతిపత్రం
February 26, 2026 06:30 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

రామన్నపేట ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టేట్ సౌతేర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్సి జీఎం యు. బాలస్వామి గురువారం రామన్నపేట మండల కేంద్రంలో పర్యటించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా టిటిడి కల్యాణ మండపం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

వేసవి కాలంలో లోడ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో చౌటుప్పల్ డివిజనల్ ఇంజనీర్ డి. మల్లికార్జున్ గౌడ్, ఏడిఈ కట్ట శ్రీకాంత్, ఏఈ కోటేశ్వరరావు, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, సిబ్బంది నటరాజ్, విజయకుమార్, మేకల సురేష్, చాంద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతి

ఉప సర్పంచ్ మోటె రమేష్ సిజీఎంను కలిసి పట్టణంలోని బీసీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్థంభాలకు ఎల్‌టీ, 11 కేవీ, 33 కేవీ లైన్లను ఒకే పెద్ద స్థంభాలపై అమర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి కాలనీలో గొర్ల మల్లయ్య ఇంటి మీదుగా వెళ్తున్న 11 కేవీ లైన్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని భువనగిరి రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్థంభాలను తొలగించాలని వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సిజీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.

కార్యక్రమంలో నకిరేకంటి సుదర్శన్, బండ లింగస్వామి, మోటె మహేష్, జడ సంతోష్, సుర్వి హరిబాబు, ఊట్కూరి శ్రీను, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News