ప్రజా ఉద్యమాల సిపిఐని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలి
ప్రజా ఉద్యమాల సిపిఐని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలి
Biksham Goud
మూడు వార్డుల్లో సిపిఐ పార్టీ పోటీ
సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపు
స్థానికం ప్రతినిధి
సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ఉద్యమాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీని ప్రజలు ఆదరించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ధర్మబిక్షం భవనంలో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సూర్యాపేట పట్టణంలో అనేక వార్డుల్లో స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని ఆయన గుర్తు చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, వృద్ధులకు పింఛన్లు అందించాలని సిపిఐ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపట్టిందని తెలిపారు.ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుగా, ప్రజల పక్షాన నిలబడేందుకు సిపిఐ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో మిత్రపక్షాలతో పొత్తులో భాగంగా పోటీ చేస్తోందని చెప్పారు. ప్రజా ఉద్యమాల రథసారథులైన సిపిఐ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన ప్రజానీకాన్ని కోరారు.ఈ సమావేశంలో బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్, ఖమ్మం పాటి రాము, రేగటి లింగయ్య, ఎండి పాషా, బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, ఐతరాజు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి