ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)
ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవద్దు అన్న బాలా థాక్రే(పూస శ్రీనివాస్)
Editor Desk
స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సేవకులుగా వారి జీవితాలను ప్రజలకు అంకితం చేసి నిస్వార్ధంగా సేవ చేయాలని వారికి జీతాలు, పెన్షన్లు తీసుకోవడం నా దృష్టిలో తప్పుగా భావిస్తానని బాలసాహెబ్ బాల్ థాక్రే శివసేన జాతీయ సమావేశాలలో తన ప్రసంగంలో చెప్పే వాడని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున స్థానిక బస్టాండు ఆవరణలో బాలసాహెబ్ బాల్ థాక్రే పుట్టినరోజు సందర్భముగా మూడు రోజుల కార్యక్రమము ముగింపు కార్యక్రమములో యువకులతో కలిసి పండ్ల పంపిణి చేయడం జరిగింది. వారినుద్దేశించి మాట్లాడుతు పార్లమెంటు సభ్యులు కూడ పెన్షన్లు, జీతాలు, గౌరవ వేతనం తీసుకోవడం ఇష్టలేదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహారాష్ట్ర అసెంబ్లీలో 1998 సం॥రంలో జీతం, టి.ఎ., డి.ఎ.లు పెంచాలని అనడం శివసేన వ్యతిరేకిస్తున్నదని ఆనాడు బాలసాహెబ్ బాల్ థాక్రే తన అభిప్రాయం వెలిబుచ్చినట్లు పూస శ్రీనివాస్ ఆరోజుని స్మరించుకొని అన్నారు. గ్రామస్థాయి నుండి పార్లమెంటు సభ్యుల వరకు సేవకులే, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైతే దేశంలో అవినీతి యుండదని ఆనాడు దేశంలో ఎలాంటి దేశ వ్యతిరేకులు కూడ యుండరని తెలిపినారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి