Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 01:42 AM

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి
February 26, 2026 04:57 PM 561 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక – అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల పంపిణీ

పేదల సొంతింటి కల సాకారం వైపు అడుగులు – రామన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభం

నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక… నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రామన్నపేట మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇండ్లు అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గురువారం పల్లివాడ గ్రామంలో నాంపల్లి విజయలక్ష్మి–కృష్ణ దంపతులకు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజమవుతోందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, కొన్నింటిలో ఇప్పటికే గృహప్రవేశాలు జరుగుతుండగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల గృహ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల మల్లేష్, నాగులంచ నరేష్, వార్డు సభ్యులు సిరిశాల సోమలక్ష్మమ్మ, మల్లేష్, నాంపల్లి రాజు, మేకల మహేష్, దూదిమెట్ల అశోక్, మేడి మల్లయ్య, సింగపాక నరసింహ, నాంపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News