Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 06:41 PM

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి

ప్రజా ప్రభుత్వంతో పేదలకు గృహ భరోసా – పల్లివాడ లో గృహప్రవేశ కార్యక్రమంలోగంగుల వెంకట్ రాజిరెడ్డి
February 26, 2026 04:57 PM 214 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేటలో పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక – అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల పంపిణీ

పేదల సొంతింటి కల సాకారం వైపు అడుగులు – రామన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభం

నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక… నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

రామన్నపేట మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి విడతల వారీగా ఇండ్లు అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గురువారం పల్లివాడ గ్రామంలో నాంపల్లి విజయలక్ష్మి–కృష్ణ దంపతులకు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజమవుతోందని అన్నారు.

స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో నియోజకవర్గానికి సుమారు 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, కొన్నింటిలో ఇప్పటికే గృహప్రవేశాలు జరుగుతుండగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల గృహ కల సాకారం అవుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల మల్లేష్, నాగులంచ నరేష్, వార్డు సభ్యులు సిరిశాల సోమలక్ష్మమ్మ, మల్లేష్, నాంపల్లి రాజు, మేకల మహేష్, దూదిమెట్ల అశోక్, మేడి మల్లయ్య, సింగపాక నరసింహ, నాంపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News