ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ
ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ
Harish HS
ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులు ఆవిష్కరించిన డీఎస్పీ
కోదాడ పట్టణంలోని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో సూర్యనారాయణ,వారి కార్యాలయాల్లో సోమవారం ప్రజా దర్బార్ డైరీ, మీడియా ట్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ,పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక ప్రజా దర్బార్ దినపత్రిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్, తహసిల్దార్ వాజిద్ అలీ లను మర్యాదపూర్వకంగా కలిసి డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ జిల్లా స్టాపర్ బత్తిని కృష్ణమూర్తి, రిపోర్టర్ గడ్డం అంజి, మిట్టపల్లి శ్రీనివాస్, రహీం, అబ్బురం, ఫక్రుద్దీన్, నూరుద్దీన్, హరీష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి