Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 11:36 AM

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి
May 27, 2026 08:41 AM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి

స్కూళ్లలో స్టేషనరీ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి

అధికారుల కనుసైగల్లోనే అనుమతి లేని పాఠశాలలు

ఇన్‌ఛార్జ్ ఎంఈఓకు ఎస్ఎఫ్‌ఐ వినతి

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. మంగళవారం ఎస్ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపు మేరకు చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇన్‌ఛార్జ్ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.​ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్నేషనల్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ప్రతి విద్యాసంస్థ తమ ఫీజుల వివరాలను పారదర్శకంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.​జిల్లా విద్యాశాఖ అధికారుల కనుసైగల్లోనే జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తున్న స్టేషనరీ, పుస్తకాల వ్యాపారాన్ని తక్షణమే అరికట్టాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచేలా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు పల్సం సృజన, నాయకులు మణికంఠ, శీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News