Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 03:27 PM

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు
March 10, 2026 10:15 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


రాయచోటి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్–2023, ఐటీ చట్టం కింద సీఆర్ నంబర్ 132/2026తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచోటి సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పోస్టులు పెట్టడం, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వాటిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ బి.వి. చలపతి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News