Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు
10-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


రాయచోటి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్–2023, ఐటీ చట్టం కింద సీఆర్ నంబర్ 132/2026తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచోటి సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పోస్టులు పెట్టడం, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వాటిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ బి.వి. చలపతి స్పష్టం చేశారు.

Sthanikam

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

Article Image


రాయచోటి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్–2023, ఐటీ చట్టం కింద సీఆర్ నంబర్ 132/2026తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచోటి సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పోస్టులు పెట్టడం, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వాటిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ బి.వి. చలపతి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News