Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:43 PM

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు: రాయచోటి వ్యక్తిపై కేసు
March 10, 2026 10:15 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


రాయచోటి: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచోటికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్–2023, ఐటీ చట్టం కింద సీఆర్ నంబర్ 132/2026తో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాయచోటి సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా పోస్టులు పెట్టడం, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ఫేక్ అకౌంట్ల ద్వారా సమాజ శాంతికి భంగం కలిగించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వాటిని ప్రోత్సహించినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సీఐ బి.వి. చలపతి స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News