రామన్నపేట: ఇటీవల తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేముల వీరేశం ప్రభుత్వ విప్గా నియామకం కావడం గర్వకారణమని, ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దిన్, డీసీసీ కార్యదర్శి కొత్తపల్లి జాన్ అబ్రహం కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బొడ్డు సురేందర్రావు, జెల్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి