ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
Biksham
పథకాలు ప్రజల గడప దాకా చేరాలి
అర్హులందరికీ పథకాల అమలు తప్పనిసరి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. 99 రోజులపాటు ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన,ప్రగతి ప్రణాళిక రోజుల మండల స్థాయి సమావేశం గురువారంసూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడంలో అభివృద్ధి పనుల విషయంలో వేగవంతం చేయాలనిసమస్యల తక్షణ పరిష్కారం చేయడంలో అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు,ఉచిత బస్సు రైతు బీమా , ఇందిరమ్మ ఇల్లులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మహిళలు ఇందిరాగాంధీని పూర్తిగా తీసుకొని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచులే కీలకమని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించుటకు ఇదొక సదా అవకాశమని అన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు ప్రమాద బారిన పడకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని మోటార్ సైకిల్ ఉన్న ప్రతి వ్యక్తికి సేఫ్టిసైడ్ హెల్మెట్ ను దరించాలని ఎలిమెంట్ ధరిస్తే ప్రమాదాల నివారణను తగ్గించుకోవచ్చని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్సీ వెల్ఫేర్ డిడి లత, మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో వేణుమాధవ్ రావు, ఎమ్మార్వో కృష్ణయ్య, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్,ఎంపీ ఓ లింగారెడ్డి, సూపరిండెంట్ లక్ష్మి, మండల స్థాయి అధికారులు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి