ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
ప్రభుత్వ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
Krishna
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం పటాన్ చెరువు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు. మధ్యస్థ విద్య అనంతరం ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచిస్తూ, విద్యార్థి జీవితంలో తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అత్యంత కీలక దశగా పేర్కొన్నారు. ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని అంకితభావంతో కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నదని, ఈ అవకాశాలను వినియోగించుకుని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని విద్యార్థులను ప్రోత్సహించారు. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, కష్టపడే వారికి విజయమే లభిస్తుందని తెలిపారు.చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ కూడా అవసరమని వివరించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, నిల్వ గది, వంటగదిని పరిశీలించి, నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ తయారీ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కామధేను సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి