PRINT TIME: May 26, 2026 02:51 PM
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య ; సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ శ్రీకాంత్
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన విద్య ; సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ శ్రీకాంత్
April 06, 2026 07:28 PM
278 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం బడి పాట కార్యక్రమాన్ని సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉపసర్పంచ్ అనే బోయిన శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి విద్యను అభ్యసిస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం, యూనిఫాము, కంప్యూటర్ విద్య, గ్రంథాలయము సైన్స్ ల్యాబులు ఉంటాయని అన్నారు. కావున గ్రామాల్లోని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి