Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి
April 09, 2026 09:24 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యా పటిష్టతకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు. గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/ పాఠశాల ఆవరణలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులతో, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పాలకుల నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష కారణంగా ప్రాథమిక,ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలో పర్యటించి, ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు సందర్శించి తయారు చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.కొందరు అవగాహన రాహిత్యంతో కమీషన్ సిఫార్సుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ విద్యా కమీషన్ సిఫార్సులను పూర్తిగా చదివి, అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టోఫర్,కొడారి వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News