ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి
Sthanikam District Staff Reporter
బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్
తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యా పటిష్టతకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు. గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/ పాఠశాల ఆవరణలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులతో, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పాలకుల నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష కారణంగా ప్రాథమిక,ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలో పర్యటించి, ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు సందర్శించి తయారు చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.కొందరు అవగాహన రాహిత్యంతో కమీషన్ సిఫార్సుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ విద్యా కమీషన్ సిఫార్సులను పూర్తిగా చదివి, అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టోఫర్,కొడారి వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి