Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 11:12 PM

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యాప్రమాణాల పటిష్టతకు విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలి
April 09, 2026 09:24 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యా పటిష్టతకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు. గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/ పాఠశాల ఆవరణలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులతో, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పాలకుల నిర్లక్ష్యం, బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష కారణంగా ప్రాథమిక,ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలో పర్యటించి, ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలు సందర్శించి తయారు చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.కొందరు అవగాహన రాహిత్యంతో కమీషన్ సిఫార్సుల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ విద్యా కమీషన్ సిఫార్సులను పూర్తిగా చదివి, అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్,ఒగ్గు క్రిస్టోఫర్,కొడారి వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News