Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 11:09 AM

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం – బాల ఆకాష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
February 27, 2026 07:37 AM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మృతి చెందిన విద్యార్థి బాల ఆకాష్ కుటుంబానికి భారత రాష్ట్ర సమితి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన బంధనాథం బాల ఆకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

భువనగిరి శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాల ఆకాష్ ఈ నెల 15న పాఠశాల సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లి ఈత రాక మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి కేటీఆర్ రాయపురం చేరుకుని బాల ఆకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా సంబంధిత మైనారిటీ గురుకుల పాఠశాల కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, బాలుడి మృతికి బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు బాల ఆకాష్ తండ్రి అంతోనిరాజుకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

బాలుడి సోదరి మధువన్సీతను అక్కున చేర్చుకుని, “నేను నీకు అన్నగా భావించు… నువ్వు ఎంత వరకు చదివితే అంత వరకు ఉన్నత విద్య ఖర్చులన్నీ నేనే భరిస్తా” అంటూ భావోద్వేగ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News