ప్రభుత్వ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం
ప్రభుత్వ లోక్ అదాలత్లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం
Editor Desk
ఒప్పందాలతో వేగంగా ముగిసిన వివాదాలు
రామన్నపేట కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 546 కేసులకు పరిష్కారం లభించింది. కక్షిదారుల మధ్య పరస్పర ఒప్పందాలతో వివాదాలు ముగిశాయి.
సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య ఆధ్వర్యంలో కోర్టు హాల్లో లోక్ అదాలత్ నిర్వహించారు. రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్, క్రిమినల్, బ్యాంకు, ప్రీ-లిటిగేషన్, పిట్టి కేసులు విచారణకు తీసుకుని పరిష్కరించారు.
బ్యాంకు, ప్రీ-లిటిగేషన్ కేసుల ద్వారా రూ.5,18,350 నగదు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ… చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం, డబ్బు వృథా చేసుకోవడం కంటే లోక్ అదాలత్ను వినియోగించుకుని పరస్పర ఒప్పందాలతో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎస్ఐలు,
బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి