Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 08:28 PM

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం

ప్రభుత్వ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 546 కేసుల పరిష్కారం
March 28, 2026 06:29 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒప్పందాలతో వేగంగా ముగిసిన వివాదాలు

రామన్నపేట కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 546 కేసులకు పరిష్కారం లభించింది. కక్షిదారుల మధ్య పరస్పర ఒప్పందాలతో వివాదాలు ముగిశాయి.

సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.సత్తయ్య ఆధ్వర్యంలో కోర్టు హాల్‌లో లోక్ అదాలత్ నిర్వహించారు. రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్, క్రిమినల్, బ్యాంకు, ప్రీ-లిటిగేషన్, పిట్టి కేసులు విచారణకు తీసుకుని పరిష్కరించారు.

బ్యాంకు, ప్రీ-లిటిగేషన్ కేసుల ద్వారా రూ.5,18,350 నగదు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ… చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం, డబ్బు వృథా చేసుకోవడం కంటే లోక్ అదాలత్‌ను వినియోగించుకుని పరస్పర ఒప్పందాలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎస్ఐలు,

బ్యాంక్ మేనేజర్లు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News