Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:59 AM

పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్

పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్

 పనులు ఆలస్యం సహించం: అదనపు కలెక్టర్
March 24, 2026 03:00 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులపై కఠిన ఆదేశాలు

పెండింగ్ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులకు డెడ్‌లైన్

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) కింద పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను వేగవంతంగా పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయడంతో పాటు పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం గుండాల మండల పంచాయతీ కార్యాలయంలో గ్రామాల వారీగా పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వసూలైన పన్నుల వివరాలు, లక్ష్యాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బందికి జీతాలు సమయానికి చెల్లించాలనీ, ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.

అలాగే గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం గుండాల గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్, మొక్కల పెంపకం, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సక్రమంగా పెంచి గ్రామాల్లో నాటే కార్యక్రమాలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలకమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News