Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

పంచాయతీ' అప్పు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా భారంగా పరిణమించిన అప్పు

పంచాయతీ' అప్పు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా భారంగా పరిణమించిన అప్పు

పంచాయతీ' అప్పు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా భారంగా పరిణమించిన అప్పు
December 29, 2025 11:14 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పదవీ బాధ్యతలు స్వీకరించిన సర్పంచుల్లోనూ అంతర్మథనం

పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ లు పదవీ బాధ్యతలు చేపట్టినా, వారిలో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థుల్లో గెలిచిన, ఓడిన వారు అప్పుల భారంతో సతమత మవుతున్నారని గ్రామాల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరు గుతోంది. గెలుపొందినవారు పదవిని దక్కించు గ్రామ పంచాయతి కున్నా, ఖర్చుల భారం తీరక అప్పుల పాలైన పరిస్థితి నెలకొంది. ఇక ఓడిపోయిన అభ్యర్థులు పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకుని ఆర్థికంగా కుదేలవుతున్నా రని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.

- ఖర్చుల లెక్క తారుమారు

ఎన్నికల ముందు వేసుకున్న ఖర్చుల అంచనాలు ఒకలా, గెలిచిన తర్వాత ఎదురయ్యే వాస్తవ పరిస్థి తులు మరోలా ఉన్నాయని కొందరు నూతన సర్పంచులు వాపోతున్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా 'మొదటి పౌరుడు'గా నిలబడ్డామని, కానీ ఇప్పుడు అప్పులే మిగిలితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే సందిగ్ధతలో ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

- సానుభూతి రాజకీయాలపై ఆశలు

ఓడిపోయిన అభ్యర్థుల్లో కొందరు, భవిష్యత్తులో ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవుల కోసం మళ్లీ ఎన్ని కలలో పోటీ చేస్తే సానుభూతి ఓట్లు దక్కుతాయనే ఆశతో ఉన్నట్లు సమాచారం.

-ఓటర్లలో మార్పు అవసరం

డబ్బులకు లొంగకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బులు తీసుకుని ఓటు వేయడం వల్ల ఒక్కరోజు లాభం తప్ప, పోటీలో నిలబడిన కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే ప్రజా ప్రతినిధులు బాధ్యతగా సేవ చేస్తారని, అప్పుడే వారిని ప్రశ్నించే హక్కు ప్రజలకు సార్థకం అవుతుందని పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News