పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం
పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం
Biksham
రాసలీలలు, లంచాల ఆరోపణలు… పదిహేను రోజుల్లో వరుస ఘటనలు
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో వరుస వివాదాలు చోటుచేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్పై స్టేషన్కు వచ్చిన మహిళతో అనుచిత సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనలు ముగిసేలోపే, సహాయ ఉప ఇన్స్పెక్టర్కు సంబంధించిన అనుచిత ప్రవర్తన వీడియో బయటకు రావడం కలకలం రేపింది. పదిహేను రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల వల్ల శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికే కొన్ని ఘటనలపై స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శాఖ ప్రతిష్ఠ కాపాడాలి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవాలంటే పోలీసు అధికారులు నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి