Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:06 PM

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం
12-04-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాసలీలలు, లంచాల ఆరోపణలు… పదిహేను రోజుల్లో వరుస ఘటనలు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో వరుస వివాదాలు చోటుచేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై స్టేషన్‌కు వచ్చిన మహిళతో అనుచిత సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఈ ఘటనలు ముగిసేలోపే, సహాయ ఉప ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన అనుచిత ప్రవర్తన వీడియో బయటకు రావడం కలకలం రేపింది. పదిహేను రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల వల్ల శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికే కొన్ని ఘటనలపై స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శాఖ ప్రతిష్ఠ కాపాడాలి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవాలంటే పోలీసు అధికారులు నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Sthanikam

పల్నాడు పోలీసు శాఖలో వివాదాలు కలకలం

Article Image

రాసలీలలు, లంచాల ఆరోపణలు… పదిహేను రోజుల్లో వరుస ఘటనలు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలో వరుస వివాదాలు చోటుచేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై స్టేషన్‌కు వచ్చిన మహిళతో అనుచిత సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బదిలీ చర్యలు తీసుకున్నారు. మరో ఘటనలో పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఈ ఘటనలు ముగిసేలోపే, సహాయ ఉప ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన అనుచిత ప్రవర్తన వీడియో బయటకు రావడం కలకలం రేపింది. పదిహేను రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల వల్ల శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికే కొన్ని ఘటనలపై స్పందించి చర్యలు తీసుకున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శాఖ ప్రతిష్ఠ కాపాడాలి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవాలంటే పోలీసు అధికారులు నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News