Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తి సందడిలో నిదానపల్లి.. స్వామివారికి ఘన స్వాగతం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 09:56 PM

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
March 27, 2026 07:53 PM 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి సేవలందించారు.

గత ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రూ.50 వేల సొంత ఖర్చులతో బెన్నూరి హరీష్-అపర్ణ దంపతులు, బెన్నూరి శైలేష్-విజయ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. “అన్నదానం అన్నిదానాల్లో శ్రేష్ఠం” అని పేర్కొంటూ వారి సేవలను గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందకరమని, శ్రీ సీతారామచంద్రుల కృప గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కంకణాల లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ పావురాల మచ్చగిరి, కంబాలపల్లి మధు, కడమంచి నరసింహ, దండిగా పాండు, నాంపల్లి లింగయ్య, బెల్లి నరసింహ, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News