Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:20 AM

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పల్లివాడలో ఘనంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
March 27, 2026 07:53 PM 336 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి సేవలందించారు.

గత ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రూ.50 వేల సొంత ఖర్చులతో బెన్నూరి హరీష్-అపర్ణ దంపతులు, బెన్నూరి శైలేష్-విజయ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. “అన్నదానం అన్నిదానాల్లో శ్రేష్ఠం” అని పేర్కొంటూ వారి సేవలను గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందకరమని, శ్రీ సీతారామచంద్రుల కృప గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కంకణాల లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ పావురాల మచ్చగిరి, కంబాలపల్లి మధు, కడమంచి నరసింహ, దండిగా పాండు, నాంపల్లి లింగయ్య, బెల్లి నరసింహ, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News