పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్
పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్
స్థానికం బృందం
గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు
పల్లివాడ, స్థానిక ప్రతినిధి:
పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.
చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి