Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:22 AM

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

 పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్
December 30, 2025 04:12 PM 446 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు

పల్లివాడ, స్థానిక ప్రతినిధి:

పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.

చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్‌లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News