Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:33 PM

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

 పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్
December 30, 2025 04:12 PM 450 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు

పల్లివాడ, స్థానిక ప్రతినిధి:

పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.

చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్‌లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News