Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:04 AM

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

 పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్
30-12-2025 464 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు

పల్లివాడ, స్థానిక ప్రతినిధి:

పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.

చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్‌లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

Sthanikam

పల్లి వాడలో కఠిన చర్యలు సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్

Article Image

గ్రామ శాంతి, భద్రతకు పల్లెవాడలో కఠిన చర్యలు

పల్లివాడ, స్థానిక ప్రతినిధి:

పల్లివాడ గ్రామపంచాయతీలో సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజారోగ్యం పరిరక్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గ్రామంలోని వర్తక, వ్యాపారులు ఎవరూ మాదక ద్రవ్య పదార్థాల విక్రయానికి పాల్పడకూడదని సభ హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా పొలం దున్నే రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఫుల్ వీల్స్ అమర్చుకుని రహదారులపై వాహనాలు నడపరాదని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.

చికెన్ దుకాణాల నిర్వాహకులు వ్యర్థాలను ఎక్కడికక్కడ పడవేయకుండా తప్పనిసరిగా డంపింగ్ యార్డ్‌లోనే వేయాలని ఆదేశించారు. శుభ్రతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామం శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని సభ అభిప్రాయపడింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News