Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:38 PM

పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి.

పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి.

పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి.
April 17, 2026 06:22 PM 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్..

తెలంగాణ ప్రజలు ఊహించిన ప్రత్యేక రాష్ట్రం రాలేదని సంపూర్ణ సర్వోదయ తెలంగాణ ఏర్పాటు కోసం కవితక్క ప్రజల్లో కెళ్ళి పోరాడుతున్నదని తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఎన్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసమర్ధ ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు సమయంలో కొత్త పార్టీలు ఆవిర్భవించడం సహజమేనని అన్నారు . రాష్ట్రం లో ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు ప్రజల కు ఏంమేలు చేశాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం గంజాయి, అరాచకాలు, ప్రాజెక్టుల సమస్యల తో పాటు రైతు సంక్షేమాన్ని సైతం గాలికొదిలేసి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు రాష్ట్రo ఏర్పడిందన్న పేరే తప్ప ఒరిగిందేమీ లేదని దుయ్యబడ్డారు. జాగృతి కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించిన సందర్భంలో ప్రజలు రాష్ట్రం ఏర్పడిందన్న సంతృప్తిగా లేరని గమనించి ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో తేచ్చేందుకు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు అధికారంలో ఉండడానికి ఏమాత్రం తగదని ఆయన అన్నారు. ప్రజల బాగోగుల కంటే పార్టీల నాయకులు వారి పదవులు కాపాడుకోవడం ,ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యతరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలను కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గాని పరిష్కార మార్గం చూపలేదు అన్నారు. అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతనంగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజలను మమేకం చేసుకొని ఉద్యమాల దిశగా కవితక్క అడుగులు వేస్తుందని కవితక్క ఆశయాలకు ప్రజల మద్దతు వారి దీవెనలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈనెల 25న నూతన పార్టీ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు మందడి సోమిరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు నల్లబోలు సైదిరెడ్డి, నీల ఉమారాణి , నకిరేకంటి సతీష్,మాధవి డి ,శ్యాం నాయక్, గజవెల్లి ఉప్పలాచారి, గణపారపు శ్రీకాంత్,నకరికంటి చిరంజీవి , పిట్టల మహేష్,రఘు నాగమణి నీలిమ గీత,ధారావత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News