పాకిస్తాన్తో క్రికెట్ వద్దన్న బాల్ థాక్రే - పూస శ్రీనివాస్
పాకిస్తాన్తో క్రికెట్ వద్దన్న బాల్ థాక్రే - పూస శ్రీనివాస్
Editor Desk
స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్
భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, విదేశీయులతో క్రికెట్ మంచిదే గాని పాకిస్తాన్తో ఎప్పుడు క్రికెట్ ఆట ఆడవద్దని దేశభక్తుల అందరి అభిప్రాయం అదేనని,బాలసాహెబ్ బాల్ థాక్రే ఆరోజు చెప్పినట్లే జరుగుతున్నదని ఆరోజే బాలసాహెబ్ బాల్ థాక్రే మాటవింటే దేశంలో టెర్రరిస్టుల కార్యక్రమాలు తగ్గేవని పాలకులు ఆరోజు మాటవినలేదని దానికి భారతదేశం దేశభక్తులను పొడగొట్టుకున్నదని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజు వినాయక చౌరస్తాలో జరిగిన బాలసాహెబ్ బాల్ థాక్రే 99వ జన్మదినం సందర్భంగా పూస శ్రీనివాస్ మాట్లాడినారు.
రాక్షసక్రీడతో దేశంలో అలజడులు సృష్టిస్తారని పాకిస్తాన్ ఎప్పటికి రక్తపాతమే కోరుకుంటుందని, ముంబాయిలో దాడులు చేసి వందలాది మందిని పొట్టనపెట్టుకుందని ఇకనైన ఏ క్రీడలు పాకిస్తాన్తో ఆడవద్దని శివసేన (యుబిటి) కోరిక అని పూస శ్రీనివాస్ తెలిపినారు.కొందరు స్వార్ధపరులు బంగ్లాదేశ్ నుండి వలస వస్తున్న వారికి ఊడిగం చేస్తున్నారని తమగోతి వారే తవ్వుకుంటున్నారని ఇది భావితరాలకు నష్టం కలిగిస్తున్నదని శ్రీనివాస్ హెచ్చరించారు.రాబోయే రోజుల్లో శివసేన యువతను సైనికులుగా తయారు చేయడానికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బుంగిపట్ల కొండల్రెడ్డి, నాయకులు స్వామి,బాలమల్లేష్, గొర్రెంకల గణేష్,శివ,అనితారెడ్డి, సుప్రియ,జయంతి,నాగేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి