PRINT TIME: May 01, 2026 01:27 PM
పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం
పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం
May 01, 2026 11:24 AM
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో తుమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. గ్రామ అభివృద్ధికి విద్యే బాట అని పేర్కొంటూ, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు గ్రామానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు శాలువాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి