Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:51 PM

పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం

పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం

పదోతరగతి విజేతలకు గ్రామ పంచాయతీ నుంచి అభినందనల వర్షం
May 01, 2026 11:24 AM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో తుమ్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంజీవ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ తదితరులు హాజరై విద్యార్థులను అభినందించారు. గ్రామ అభివృద్ధికి విద్యే బాట అని పేర్కొంటూ, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు గ్రామానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు శాలువాలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News