Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:04 PM

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
05-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 54 మందికి అందజేత – అత్యుత్తమ మార్కులకు నగదు బహుమతి ప్రకటన

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 54 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమని సూచించారు.

పదో తరగతిలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఇది విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించి ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు యమా సంతోష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయురాలి కోరిక మేరకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుడు శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

Article Image

జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 54 మందికి అందజేత – అత్యుత్తమ మార్కులకు నగదు బహుమతి ప్రకటన

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 54 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమని సూచించారు.

పదో తరగతిలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఇది విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించి ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు యమా సంతోష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయురాలి కోరిక మేరకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుడు శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News