Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 05, 2026 12:47 PM

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
March 05, 2026 11:19 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 54 మందికి అందజేత – అత్యుత్తమ మార్కులకు నగదు బహుమతి ప్రకటన

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ నెంబర్–2 పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 54 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మిడి అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమని సూచించారు.

పదో తరగతిలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5,116 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఇది విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించి ఉత్తమ ఫలితాలకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు యమా సంతోష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయురాలి కోరిక మేరకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకుడు శ్రీరంగం రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News