Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 05:52 PM

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు

పదిహేనేళ్ల సమస్యకు ముగింపు
March 02, 2026 04:20 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

గాంధీనగర్ ఎస్సీ కాలనీలో విద్యుత్ ఇబ్బందులకు పరిష్కారం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ ఎస్సీ కాలనీలో గత పదిహేనేళ్లుగా కొనసాగుతున్న తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, భూక్యా మహేష్ దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లగా, వారు వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను సక్రమం చేశారు. సమస్య పరిష్కారమవడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉగ్గం అశోక్ యాదవ్, బాలెంల వీరయ్య, అంతటి ఉప్పలయ్య దుర్గయ్య, జక్కలి సైదులు, మహమూద్ పాషా, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News