భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి పరీక్షలకు ముందు రోజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్నగర్కు చెందిన అప్పం నితీష్ (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పరీక్షల ఒత్తిడితోనే నితీష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్కు అకారణంగా మార్చడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా ఈ ఘటనకు కారణమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి