Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య
March 13, 2026 09:11 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి పరీక్షలకు ముందు రోజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌కు చెందిన అప్పం నితీష్ (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పరీక్షల ఒత్తిడితోనే నితీష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్‌కు అకారణంగా మార్చడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా ఈ ఘటనకు కారణమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News