Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 10:55 PM

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

పది పరీక్షల ముందురోజే విషాదం పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య
March 13, 2026 09:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

భద్రాద్రి కొత్తగూడెం: పదవ తరగతి పరీక్షలకు ముందు రోజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌కు చెందిన అప్పం నితీష్ (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పరీక్షల ఒత్తిడితోనే నితీష్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని K1 బ్రాంచ్ నుంచి K2 బ్రాంచ్‌కు అకారణంగా మార్చడంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రవర్తన కూడా ఈ ఘటనకు కారణమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News