Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 20, 2026 03:23 PM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్: విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, విద్యా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, మెనూ ప్రకారం రుచికరమైన, పోషకాహారం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతోనే వంటలు చేయాలని ఆదేశించారు.

పాఠశాల వంటగది, మరుగుదొడ్లు పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆర్.ఓ ప్లాంట్ ద్వారా అందుతున్న తాగునీటి సౌకర్యాన్ని కూడా పరిశీలించారు.

అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారి లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థి పోలీస్ అవుతానని చెప్పగా, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడాలని ప్రోత్సహించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారో తెలుసుకుని, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పరీక్షల సమయంలో భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా రాయాలని, మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత చదువులకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News