PRINT TIME: March 23, 2026 05:16 PM
పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
March 23, 2026 03:42 PM
21 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదగిరిగుట్ట,
పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పరీక్షలు పూర్తయ్యాక ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి