Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:13 AM

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు
March 18, 2026 06:11 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూరు, ఆలేరు మండలాల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జిల్లా పరిషత్ హై స్కూల్‌లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తుతో భద్రంగా తరలించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News