Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 18, 2026 07:54 PM

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పదవ తరగతి పరీక్షలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు
March 18, 2026 06:11 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మోటకొండూరు, ఆలేరు మండలాల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జిల్లా పరిషత్ హై స్కూల్‌లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తుతో భద్రంగా తరలించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News