Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:12 AM

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
18-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతోనే తరలించాలని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Sthanikam

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతోనే తరలించాలని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News