Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 18, 2026 07:46 PM

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

పదవ తరగతి పరీక్షలపై కలెక్టర్ కట్టుదిట్టమైన ఆదేశాలు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
March 18, 2026 05:47 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తిగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను పోలీస్ భద్రతతోనే తరలించాలని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News