పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
Biksham Goud
బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
మునగాల, మార్చి 12: స్థానిక మండల కేంద్రంలోని ట్రినీటి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బేతెస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్యాడ్లు, కలాలు, స్కేలులు, పెన్సిల్లు, చెరిపే పరికరాలు, పదును పెట్టే పరికరాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ నిర్వహణాధికారి దుర్గం కరుణ శ్రీ ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పదవ తరగతిలో సాధించే మార్కులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ సేవా సంస్థ వ్యవస్థాపకులు దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఉన్నత పాఠశాల ప్రతినిధి మల్లంగి వనజ, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి