హైదరాబాద్ నగరంలోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొని పాదరావు ప్రజాసేవను స్మరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో,శాసనసభ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించటంలో పాదరావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బండ్ల ప్రకాశ్, శాసన మండలి సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని పాదరావుకు ఘన నివాళులు అర్పించారు.
PRINT TIME: August 31, 2026 02:39 AM
పాదరావు సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
పాదరావు సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
02-03-2026
46 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొని పాదరావు ప్రజాసేవను స్మరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో,శాసనసభ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించటంలో పాదరావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బండ్ల ప్రకాశ్, శాసన మండలి సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని పాదరావుకు ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి