Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:08 AM

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
March 11, 2026 04:00 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా రాసి ఉత్తీర్ణత సాధించాలని చాట్రాయి మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో–1) మాసగిరి శ్రీనివాస్ సూచించారు. విద్యార్థులు క్రమపద్ధతిలో చదువుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

మర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఎంఈవో, పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, సమయపాలన, మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు, పరీక్షల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఇష్టపడి చదివితే విజయం తప్పక దక్కుతుందని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆయన సూచించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి చాట్రాయి మండలాన్ని ఏలూరు జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పాస్ సర్టిఫికెట్‌ను తల్లిదండ్రుల చేతిలో పెట్టినప్పుడు వారికి కలిగే ఆనందానికి అవధులు ఉండవని తెలిపారు.

అనంతరం పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రఘు తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News