ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి – ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి : ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా రాసి ఉత్తీర్ణత సాధించాలని చాట్రాయి మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో–1) మాసగిరి శ్రీనివాస్ సూచించారు. విద్యార్థులు క్రమపద్ధతిలో చదువుతూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
మర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఎంఈవో, పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, సమయపాలన, మానసిక ఒత్తిడిని అధిగమించే మార్గాలు, పరీక్షల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఇష్టపడి చదివితే విజయం తప్పక దక్కుతుందని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆయన సూచించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి చాట్రాయి మండలాన్ని ఏలూరు జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పాస్ సర్టిఫికెట్ను తల్లిదండ్రుల చేతిలో పెట్టినప్పుడు వారికి కలిగే ఆనందానికి అవధులు ఉండవని తెలిపారు.
అనంతరం పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రఘు తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి