Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:26 AM

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం
24-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్: ట్రాన్స్‌ఫార్మింగ్ రీసెర్చ్ అండ్ అకాడెమిక్స్ ఇన్ ది AI యుగం (OER–TRAAI 2026)” పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎస్. సుధర్శన్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, డిజిటల్ లెర్నింగ్, ఓపెన్ యాక్సెస్ వనరులు, ఆన్‌లైన్ బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయని తెలిపారు.

గౌరవ అతిథి డా. ఈ. మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని, పరిశోధనలో కొత్త దృక్కోణాలను అవలంబించాలని సూచించారు. ఆధునిక పోటీతత్వ ప్రపంచంలో నిలవాలంటే అంతరశాఖా అధ్యయనాలు అవసరమన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా ప్రక్రియలో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి సదస్సులు విద్యార్థులు, అధ్యాపకులకు కొత్త అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

సదస్సు నిర్వహణ కార్యదర్శి డా. పి. శంకరయ్య వివరాలు తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ నుంచి సుమారు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 45 పరిశోధనా పత్రాలు స్వీకరించి, పీర్ రివ్యూడ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.

సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు పాల్గొన్నవారికి ఉపయోగకరంగా నిలిచాయని, సదస్సు ద్వారా OER, AI ప్రాముఖ్యతపై విస్తృత చర్చలు జరిగాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

Article Image

గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్: ట్రాన్స్‌ఫార్మింగ్ రీసెర్చ్ అండ్ అకాడెమిక్స్ ఇన్ ది AI యుగం (OER–TRAAI 2026)” పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎస్. సుధర్శన్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, డిజిటల్ లెర్నింగ్, ఓపెన్ యాక్సెస్ వనరులు, ఆన్‌లైన్ బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయని తెలిపారు.

గౌరవ అతిథి డా. ఈ. మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని, పరిశోధనలో కొత్త దృక్కోణాలను అవలంబించాలని సూచించారు. ఆధునిక పోటీతత్వ ప్రపంచంలో నిలవాలంటే అంతరశాఖా అధ్యయనాలు అవసరమన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా ప్రక్రియలో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి సదస్సులు విద్యార్థులు, అధ్యాపకులకు కొత్త అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

సదస్సు నిర్వహణ కార్యదర్శి డా. పి. శంకరయ్య వివరాలు తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ నుంచి సుమారు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 45 పరిశోధనా పత్రాలు స్వీకరించి, పీర్ రివ్యూడ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.

సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు పాల్గొన్నవారికి ఉపయోగకరంగా నిలిచాయని, సదస్సు ద్వారా OER, AI ప్రాముఖ్యతపై విస్తృత చర్చలు జరిగాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News