Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:57 AM

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం

ఓపెన్ ఎడ్యుకేషన్, AIపై జాతీయ సదస్సు ప్రారంభం
March 24, 2026 08:24 AM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్: ట్రాన్స్‌ఫార్మింగ్ రీసెర్చ్ అండ్ అకాడెమిక్స్ ఇన్ ది AI యుగం (OER–TRAAI 2026)” పేరిట రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎస్. సుధర్శన్ రావు (రిటైర్డ్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, డిజిటల్ లెర్నింగ్, ఓపెన్ యాక్సెస్ వనరులు, ఆన్‌లైన్ బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయని తెలిపారు.

గౌరవ అతిథి డా. ఈ. మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని, పరిశోధనలో కొత్త దృక్కోణాలను అవలంబించాలని సూచించారు. ఆధునిక పోటీతత్వ ప్రపంచంలో నిలవాలంటే అంతరశాఖా అధ్యయనాలు అవసరమన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా ప్రక్రియలో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి సదస్సులు విద్యార్థులు, అధ్యాపకులకు కొత్త అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.

సదస్సు నిర్వహణ కార్యదర్శి డా. పి. శంకరయ్య వివరాలు తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ నుంచి సుమారు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 45 పరిశోధనా పత్రాలు స్వీకరించి, పీర్ రివ్యూడ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు.

సాంకేతిక సెషన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు పాల్గొన్నవారికి ఉపయోగకరంగా నిలిచాయని, సదస్సు ద్వారా OER, AI ప్రాముఖ్యతపై విస్తృత చర్చలు జరిగాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News