ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి
ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి
Sthanikam District Staff Reporter krishna
ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్లో భాగంగా, ఖేడ్ మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటును నమోదు చేసుకున్నారు. 2వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఆమె సాధారణ ఓటరుగా హాజరై ప్రజాస్వామ్యానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.ఈ సందర్భంగా ఎన్.ఉమాహారతి మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దారి తీసే నాయకత్వాన్ని ఎన్నుకునే మహత్తర అవకాశమని,అందరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండగా, అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లు కూడా క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం సంతోషకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి