Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:50 AM

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి
11-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్‌లో భాగంగా, ఖేడ్ మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటును నమోదు చేసుకున్నారు. 2వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్‌లో ఆమె సాధారణ ఓటరుగా హాజరై ప్రజాస్వామ్యానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.ఈ సందర్భంగా ఎన్.ఉమాహారతి మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దారి తీసే నాయకత్వాన్ని ఎన్నుకునే మహత్తర అవకాశమని,అందరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండగా, అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లు కూడా క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం సంతోషకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ఓటు హక్కు నూ వినియోగించుకున్న ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి

Article Image

ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమాహారతి బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలింగ్‌లో భాగంగా, ఖేడ్ మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటును నమోదు చేసుకున్నారు. 2వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్‌లో ఆమె సాధారణ ఓటరుగా హాజరై ప్రజాస్వామ్యానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.ఈ సందర్భంగా ఎన్.ఉమాహారతి మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దారి తీసే నాయకత్వాన్ని ఎన్నుకునే మహత్తర అవకాశమని,అందరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.పోలింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండగా, అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. ఓటర్లు కూడా క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం సంతోషకరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News