ఓటర్ జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి :
చిట్యాల ఓటర్ జాబితా సవరణపై ఈనెల 8 లోపు దరఖాస్తు చేసుకోవాలి చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అన్నారు సోమవారం రోజున చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఓటర్ జాబితా పై అఖిలపక్షల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం పూర్తయిందని, ఈ జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్న ఏమైనా సవరణలు చేయాలన్న ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 10న ఓటర్ తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని దాని తర్వాత ఓటరు జాబితా ను ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని తెలిపారు. మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పోకల యేసురత్నం, రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య గౌడ్, సిపిఎం నాయకులు శీల రాజయ్య, బిజెపి నాయకులు చికిలంమెట్ల అశోక్, బిఎస్పి నాయకులు గ్యార మారయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి