Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:41 PM

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ
January 27, 2026 06:48 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద “చలో ఢిల్లీ” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తయినా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ లలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు, అలాగే తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోస్ మహేష్ చారి, జిల్లా కన్వీనర్ బయ్యా రాజేష్, బీసీ యువజన సంఘం నాయకులు పరాల సాయి, ఉప్పల మధుసూదన్, తండు నాగేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News