Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీజ్ వేడుకల్లో సంప్రదాయ నృత్యాలతో సందడి.. పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:31 PM

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ
27-01-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద “చలో ఢిల్లీ” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తయినా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ లలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు, అలాగే తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోస్ మహేష్ చారి, జిల్లా కన్వీనర్ బయ్యా రాజేష్, బీసీ యువజన సంఘం నాయకులు పరాల సాయి, ఉప్పల మధుసూదన్, తండు నాగేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓబీసీలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలి : బీసీ విద్యార్థి జేఏసీ

Article Image

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఓబీసీలకు అధిక నిధులు కేటాయించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద “చలో ఢిల్లీ” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు పూర్తయినా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, క్రిమి లేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్, అసెంబ్లీ లలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోట కేటాయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు, అలాగే తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోస్ మహేష్ చారి, జిల్లా కన్వీనర్ బయ్యా రాజేష్, బీసీ యువజన సంఘం నాయకులు పరాల సాయి, ఉప్పల మధుసూదన్, తండు నాగేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News