ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్
ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్
Harish HS
ఒకటో వార్డులో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సామినేని రజిని నరేష్
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామినేని రజిని నరేష్ వినూత్న రీతిలో డప్పు కొడుతూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసిన ఓటుకు విలువ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. వార్డు ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్న మంత్రి ఎమ్మెల్యే సహకారంతో వాటికి పరిష్కార మార్గాన్ని చేపడుతారని వార్డు ప్రజలకు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి